హైదరాబాద్ – ఈ మధ్యన జవాబుదారీగా ఉండాల్సిన ఉన్నతాధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. ఆయన వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత తను బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఎమ్మెల్సీ కావడం జరిగింది. తాజాగా ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు మరో ఐఏఎస్ ఆఫీసర్ శరత్.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగిన ఇందిర సిరి జల వికాస్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సభా వేదికగా వేలాది మంది జనం చూస్తుండగా సిగ్గు లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ నన్న సోయి మరిచి పోయిన శరత్ సీఎం కాళ్లు మొక్కేందుకు ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
ఈ మొత్తం వ్యవహారం కలకలం రేపింది. ఈ సందర్బంగా సీరియస్ గా స్పందించారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు. శరత్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నపుడు బాధ్యతగా వ్యవరించాలి అంటూ మండిపడ్డారు. ఇటీవల ప్రభుత్వ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు.