హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ప్రజా యుద్ద నౌక, దివంగత గద్దర్ కు నివాళిగా ఆయన పేరుతో ఏర్పాటు చేసిన గద్దర్ ఫౌండేషన్ కు రూ. 3 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు గాను ఈ ఫౌండేషన్ కు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
ఇదిలా ఉండగా గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ ను అవమానించింది. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. అయినా తట్టుకుని నిలబడ్డాడు. తను ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన గాయకుడు. శరీరంలో తూటాలు పెట్టుకుని పాటలు పాడాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోశాడు. మలి దశ పోరాటానికి తాను పాటై ప్రయాణం చేశాడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
గద్దర్ కారణంగా లక్షలాది మంది ప్రజలు చైతన్యవంతం చెందారు. గత ప్రభుత్వ రాచరిక పాలనకు చరమగీతం పాడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా పాలనకు ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించారు ప్రజా యుద్ద నౌక. ఈ సందర్బంగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయన స్మారకార్థం ఇక నుంచి ప్రతి ఏటా గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం హైటెక్స్ లో అవార్డులను ప్రదానం చేశారు సీఎం.