హైదరాబాద్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గాను కీలక సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అంతర్గత కమిటీని నియమించడం విశేషం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ప్రత్యేక కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కన్వీనర్గా ఉంటారు.
తెలుగు పరిశ్రమ నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో సహా 30 మంది సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. నిర్మాతల రంగం నుండి 10 మంది మెంబర్స్, పంపిణీ రంగం నుండి 10 మంది సభ్యులు, ఎగ్జిబిటర్స్ నుంచి మరో 10 మందిని ఎంపిక చేశారు.
వీరిలో దిల్ రాజు, ప్రసన్న కుమార్, కళ్యాణ్, రవి కిషోర్, దామోదర ప్రసాద్, రవి శంకర్, నాగ వంశీ, దానయ్య, స్వప్న దత్, సుప్రియ ఉన్నారు. పంపిణీ రంగం నుంచి భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం. సుధాకర్, శిరీష్ రెడ్డి, వెంకటేష్ రావు, రాందాస్, నాగార్జున, సెడెడ్ కుమార్, భరత్ చౌదరి ఉన్నారు.
ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి రామ్ ప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణ బాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేంద్ర రెడ్డిలు ఎంపికయ్యారు. ప్రధానంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను పరిష్కరించేందుకు కమిటీ పని చేస్తుంది.