TG Eapcet : తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు ఈ ఏడాదికి సంబంధించి విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన నివాసంలో వీటిని రిలీజ్ చేశారు. ఈసారి ఫలితాలలో బాలురే టాప్ లో నిలవడం విశేసం. మరో వైపు అభ్యర్థుల మొబైల్ నంబర్లకు తమ ర్యాంకుల వివరాలు అందించారు. ఇది నూతన ప్రయోగం అని చెప్పక తప్పదు. ఈ ఎప్ సెట్ లో ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీకి దీనిని నిర్వహించారు. ఈ ఎక్జామ్ ను జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ (జేఎన్టీయూ) నిర్వహించింది.
TG Eapcet Results
గత ఏప్రిల్ నెల 29, 30వ తేదీలలో వ్యవసాయ, ఫార్మా కోర్సులకు సంబంధించి పరీక్షలు చేపట్టారు. మే నెల 2,3,4 తేదీలలో ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి ప్రవేశ పరీక్ష జరిపారు. ఫార్మా, అగ్రి కోర్సులకు గాను 81 వేల 198 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షలకు పైగా పరీక్షలు రాశారు స్టూడెంట్స్. ఈ ఫలితాల్లో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడకు చెందిన పల్లా భరత్ చంద్ర తొలి ర్యాంకు సాధించాడు. రెండో ర్యాంకు రంగారెడ్డి జిల్లా మాదాపూర్ కు చెందిన రామ్ చరణ్ రెడ్డి సాధించాడు. మూడో ర్యాంకును హేమ సాయి సూర్య పొందాడు.
ఇక వరుస ర్యాంకుల పరంగా చూస్తే లక్ష్మీ బార్గవ్, వెంకట గనేష్ రాయల్, సుంకర సాయి రిశాంత్ రెడ్డి, రష్మిత్ బండారి, బనిబ్రత మాజీ, కొత్త ధనుష్ రెడ్డి, కొమ్మ శ్రీకార్తీక్ నిలిచారు. అగ్రి, ఫార్మా ఫలితాల్లో సాకేత్ రెడ్డి, లలిత్ వరేణ్య, అక్షిత్ కు 1, 2, 3 ర్యాంకులు సాధించారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన సాయినాథ్ 4వ ర్యాంకు పొందాడు. 5వ ర్యాంకు బ్రాహ్మణి, అఖిరా నంద్ రెడ్డి, భాను ప్రకాశ్ రెడ్డి, సాత్విక్ ఉన్నారు.
Also Read : Modi Sensational Comment :భారత్ లో ఇంకొకరి జోక్యం సహించం