అమరావతి – సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , ఏపీ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆమ్రాపాలి కాటాకు బిగ్ రిలీఫ్ లభించింది. తనతో పాటు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర సర్కార్. ఇలా ఎంత కాలం తెలంగాణలో ఉంటారంటూ ప్రశ్నించింది. తక్షణమే మీకు కేటాయించిన ఏపీకి వెళ్లి పోవాలని ఆదేశించింది. దీనిపై నానా యాగి చేశారు ఈ ఆఫీసర్లు. మంచి హోదా, గౌరవం, ఆకర్షనీయమైన జీతం, సకల సౌకర్యాలు పొందుతూ హైదరాబాద్ లోనే తిష్ట వేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది కూడా.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఆమ్రాపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమెను ఎవరు ప్రమోట్ చేస్తున్నారనే దానిపై కూడా పెద్ద చర్చ జరిగింది. ఇదే సమయంలో వెళ్లి పోవాలని ఆదేశించినా చివరి వరకు ప్రయత్నం చేశారు. హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. గత్యంతరం లేక విధుల్లో చేరారు ఆమ్రపాలి అండ్ అదర్స్ ఆఫీసర్స్.
ఈ సమయంలో తను మరోసారి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించింది. కీలక తీర్పు వెలువరించింది. తనను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని ఆదేశించింది. దీంతో క్యాట్ తన బదిలీకి పచ్చ జెండా ఊపింది. మొత్తంగా ఆమ్రాపాలి మరోసారి తెలంగాణలో చక్రం తిప్పేందుకు రానుందన్నమాట.