మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తను తీవ్ర అసౌకర్యానికి గురైసట్లు హైదరాబాద్ లో తెలంగాణ సర్కార్ నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్బంగా ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వాపోయింది. ఈ మిస్ వరల్డ్ పోటీలలో 108 మందికి పైగా దేశాల నుంచి సుందరీమణులు హాజరయ్యారు. చివరకు ఎనిమిది మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు.
చివరకు ముగ్గురిని ఎంపిక చేశారు. మిస్ వరల్డ్ 2025గా థాయిలాండ్ కు చెందిన మిస్ ఎంపికైంది. ఈ సందర్బంగా తమను వేశ్య లాగా చూశారని సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై ఎంక్వయిరీకి ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శిఖా గోయెల్ ను ఎంపిక చేశారు. ఆమెతో పాటు రెమా రాజేశ్వరి కూడా ఇందులో ఉన్నారు.
మేము కూడా మనుష/లమేనని, తమకు కూడా కలలు, ఆశలు, ఆలోచనలు కూడా ఉంటాయని పేర్కొంది మిల్లా మాగీ. తాజాగా ప్రముఖ పత్రిక ది గార్డియన్ తో చిట్ చాట్ చేసింది. మరోసారి అందాల పోటీలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. అందాల సుందరీమణుల చిరునవ్వుల వెనుక చాలా కన్నీళ్లు ఉంటాయని పేర్కొంది. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.