భారతీయ సినీ దర్శకుడు మణిరత్నం పైకి మౌనంగా కనిపించినా ఆయన షూటింగ్ మాత్రం చాలా వైల్డ్ గా ఉంటుందని ఓ సినీ హీరోయిన్ ఈ మధ్యనే చెప్పేసింది. తను ఏ సినిమా తీసినా దానికి ఓ ప్రయోజనం ఉంటుంది. అందులో మెస్మరైజ్ చేసే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. తాజాగా ఇలయ నాయగన్ నటించిన , ముఖ్య పాత్ర పోషించిన సిలాంబరసన్ , అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ ప్రధాన అట్రాక్షన్ గా మారిన చిత్రం థగ్ లైఫ్ . జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆదరణ పొందింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది.
ఇక ఎప్పటి లాగే కమల్ నటించిన ప్రతి మూవీలో ఏదో ఒక అంశం వివాదానికి దారి తీస్తూనే వస్తోంది. ఇక మణిరత్నం చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు సినిమా తీసేటప్పుడు. ప్రేమ, రొమాన్స్ , బంధాలను తెలియ చేసే సమయంలో తను ఎక్కువగా ఫోకస్ ఉండేలా చూస్తాడు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా 38 ఏళ్ల సుదీర్గ విరామం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ తిరిగి కలుసుకున్నారు. థగ్ లైఫ్ తో ముందుకు వచ్చారు.
సినిమా ప్రమోషన్స్ చిత్రానికి బాగానే కలిసి వచ్చేలా చేశాయి. కానీ చెన్నై వేదికగా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. చివరకు కోర్టు జోక్యం చేసుకోవడంతో మనోడు సారీ చెప్పాడు. ఇక థగ్ లైఫ్ లో నటించిన సిలాంబరసన్ అలియాస్ శింబు నటన అద్భుతంగా ఉందంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. తను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. తనకోసమైనా సినిమా చూడాలని అంటున్నారు ఫ్యాన్స్.