బాలీవుడ్ దిగ్గజ నటుడు, కండల వీరుడిగా పేరు పొందిన సల్మాన్ ఖాన్ , అందాల తార కత్రీనా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 చిత్రం ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. భారీ బడ్జెట్ తో దీనిని తీశారు దర్శకుడు. గతంలో వచ్చిన టైగర్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం.
విచిత్రం ఏమిటంటే ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇది ముచ్చటగా మూడోది . ఇది కూడా ఓ రికార్డే. ఈ మధ్యన సినిమా రంగానికి సంబంధించి సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలు దానిని సీక్వెల్ గా తీస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ ను సీక్వెల్ తీశాడు. రాజమౌళి బాహు బలిని తీశాడు. ఇక రజనీకాంత్ నటించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన జైలర్ కూడా సీక్వెల్ గా రాబోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి.
ఇక బాలీవుడ్ కు సంబంధించి భారీ ఎత్తున రాబోతోంది టైగర్ -3 చిత్రం . భారీ అంచనాలు కూడా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత సల్మాన్ ఖాన్ చిత్రం రావడంతో ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అక్టోబర్ 16న ఈ చిత్రం రానుంది.