ఆర్సీబీలో చేర‌నున్న ఆ ఇద్ద‌రు స్టార్స్

మ‌రింత జ‌ట్టుకు బ‌లం చేకూర‌నుంది

బెంగ‌ళూరు – ఐపీఎల్ 2025 మెగా టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది మే 17 నుంచి. టైటిల్ పోరు కోసం సిద్ద‌మ‌య్యాయి నాలుగు జ‌ట్లు. ఈసారి క‌ప్ కోసం పోటీ నెల‌కొంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతోంది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. ఇదిలా ఉండ‌గా బిగ్ షాక్ త‌గిలింది ఆయా జ‌ట్ల‌కు. విదేశీ ఆటగాళ్ల‌ను మే 26 లోపు విడుద‌ల చేయాల‌ని సూచించింది. దీంతో కీల‌క‌మైన ప్లేయ‌ర్స్ ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నారు.

ఈ త‌రుణంలో ఈసారి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది ఆర్సీబీ. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ కీల‌క పాత్ర పోషించాడు. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ క‌ప్ చేజిక్కించు కోవాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. జ‌ట్టులో కోహ్లీతో పాటు విదేశీ స్టార్స్ టిమ్ డేవిడ్, రొమారియో షెఫ‌ర్డ్ తిరిగి చేర‌నున్నారు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో కీ రోల్ పోషించారు ఈ ఇద్ద‌రు. షెఫ‌ర్డ్ రాక‌తో మిడిలార్డ‌ర్ మ‌రింత బ‌లంగా మార‌నుంది. త‌ను ఆల్ రౌండ‌ర్ గా రాణిస్తుండ‌డం జ‌ట్టుకు ప్ల‌స్ పాయింట్ కానుంది.

ఇదిలా ఉండ‌గా టోర్నీలో భాగంగా ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుతో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో షెఫ‌ర్డ్ దుమ్ము రేపాడు. కేవ‌లం 14 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 53 ర‌న్స్ చేశాడు. త‌ను వెస్టిండీస్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో ఆర్సీబీలో ఆడేందుకు జాక‌బ్ బెథెల్, లియామ్ లివింగ్ స్టోన్ , ఫిల్ సాల్ట్ బెంగ‌ళూరుకు చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com