Tollywood Popular Hero’s : ఒకే వేదిక‌పై సూప‌ర్ స్టార్స్

లండ‌న్ ఈవెంట్ కు రెడీ

Tollywood  : టాలీవుడ్ హీరోల స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది. వారి ఇమేజ్ ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా విస్త‌రించింది. ప్ర‌త్యేకించి ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. భార‌తీయ సినిమాను షేక్ చేసింది. రికార్డుల మోత మోగించింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది.

Tollywood Popular Hero’s

గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్, స్వ‌ర మాంత్రికుడు ఎంఎం కీర‌వాణికి సంయుక్తంగా పుర‌స్కారం అందజేసింది. ఇందులో జూనియ‌ర్ ఎన్టీఆర్, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్(Ram Charan) కీల‌క పాత్ర పోషించారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కూడా మ‌రో పాత్ర‌లో న‌టించింది. ఇదిలా ఉండ‌గా తాజాగా లండ‌న్ లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్ లో లైవ్ క‌న్స‌ర్ట్ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. దీంతో వీరి కెరీర్ లో అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నారు.

విచ‌త్రం ఏమిటంటే ఈ అరుదైన ఈవెంట్ లో చెర్రీ , తార‌క్ ల‌తో పాటు ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా హాజ‌రు కావ‌డం విశేషం. దీంతో ఎన్నారైలు ఫుల్ ఖుష్ కు గుర‌య్యారు. కాగా ఈ స్పెష‌ల్ షోకు రావాలంటూ ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌డంతో కాద‌న‌లేక పోయాడు మ‌హేష్ బాబు. మొత్తంగా ఒకే వేదిక‌ను పంచుకున్నారు స్టార్ హీరోస్. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Victory Venkatesh-Trivikram :త్రివిక్ర‌మ్ తో వెంకీమామ మూవీకి రెడీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com