మెగా టోర్నమెంట్ టాటా ఐపీఎల్ 2025 ఆఖరు దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన భారీ వేలం పాటలో అత్యధిక ధరకు ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఆయా జట్లకు చెందిన యాజమాన్యాలు. ప్రపంచ క్రికెట్ లో భారీ ధరకు అమ్ముడు పోయాడు ఢిల్లీకి చెందిన ఆటగాడు రిషబ్ పంత్. తను ఆటగాడిగా, కెప్టెన్ గా పూర్తిగా విఫలం అయ్యాడు. ఏకంగా లక్నో సూపర్ జెయింట్స్ తనను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతర ఆటగాళ్లను చేజిక్కించుకున్నా వారంతా ఈ సీజన్ లో ఆశించిన మేర రాణించ లేక పోయారు .తీవ్ర నిరాశకు గురి చేశారు.
వారిలో చాలా మంది టాప్ ఆటగాళ్లు ఉన్నారు. కానీ పర్ ఫార్మెన్స్ పరంగా తేలి పోయారు. రిషబ్ పంత్ నుండి గ్లెన్ మ్యాక్స్ వెల్ దాకా, జేక్ ఫ్రేజర్ నుండి మక్ గుర్క్ , షమీ నుండి రచిన్ రవీంద్ర దాకా ఆడలేక పోయారు. దీంతో వీరిని ఎంపిక చేసుకున్న జట్ల మేనేజెమెంట్స్ తలపట్టుకు కూర్చున్నాయి. ఆటగాళ్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. కేవలం తను ఈ సీజన్ లో 48 రన్స్ మాత్రమే చేశాడు. గాయం కారణంగా నిష్క్రమించాడు. బౌలర్ల చేతిలో 5 సార్లు ఔట్ అయ్యాడు.
ఇక రిషబ్ పంత్ గురించి చెప్పాల్సి వస్తే తను 11 మ్యాచ్ లలో కేవలం 141 రన్స్ మాత్రమే చేశాడు. ఈ సీజన్ లో 100 రన్స్ చేసిన 67 మంది బ్యాటర్లలో తను కూడా ఒకడు. మహ్మద్ షమీ ని సన్ రైజర్స్ తీసుకుంది. తను ఎలాంటి ప్రభావం చూపించ లేక పోయాడు. 9 మ్యాచ్ లలో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. జేక్ ఫ్రేజర్, మెక్ గుర్క్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడారు. 55 రన్స్ సాధించారు. మరో కీలక ఆటగాడు రచిన్ రవీంద్ర. తను చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహంచాడు. 8 ఇన్నింగ్స్ లలో 191 రన్స్ చేశాడు.