శ‌శి కుమార్ టూరిస్ట్ ఫ్యామిలీనా మ‌జాకా

ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 75 కోట్లు దాటేసింది

ఎలాంటి అంచ‌నాలు లేకుండా త‌మిళ సినీ రంగం నుంచి వ‌చ్చిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో భారీ ఎత్తున కోట్లు క‌లెక్ష‌న్స్ చేసింది. ఇది అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఇందులో శ‌శి కుమార్ తో పాటు విల‌క్ష‌ణ న‌టి సిమ్రాన్ న‌టించారు. అద్భుత‌మైన న‌ట‌న‌, సూప‌ర్ క‌థ ఈ సినిమా స‌క్సెస్ కు కార‌ణ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మే 22వ తేదీ నాటికి వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 75 కోట్లు దాటేసింద‌ని సినీ వ‌ర్గాల భోగ‌ట్టా. ఈ ఏడాది 2025లో అత్య‌ధికంగా వ‌సూళ్లు చేసిన నాల్గ‌వ కోలీవుడ్ మూవీగా అవ‌త‌రించేందుకు సిద్దంగా ఉంది టూరిస్ట్ ఫ్యామిలీ. అభిషాన్ జీవింత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో మూడు వారాల పాటు న‌డిచింది. ఈ రోజు రూ. 71 ల‌క్ష‌లు వ‌చ్చాయి. మొత్తం క‌లెక్ష‌న్స్ ఇండియా ప‌రంగా చూస్తే రూ. 54.18 కోట్లకు పెరిగాయి. ప‌న్నుల‌తో స‌హా స్థూల ఆదాయం రూ. 63.93 కోట్లుగా ఉన్న‌ట్లు తెలిపింది.

మ‌రో వైపు త‌మిళ సినీ న‌టుడు సూర్య , బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే క‌లిసి న‌టించిన కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రెట్రో మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇది వ‌చ్చీ రావ‌డంతోనే ఓపెనింగ్ సాధించింది. మిశ్ర‌మ స‌మీక్ష‌ల కార‌ణంగా కొంత వెన‌క్కి త‌గ్గింది వ‌సూళ్ల విష‌యంలో . ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 54.44 కోట్లు సాధించింది. టూరిస్ట్ ఫ్యామిలీ రెట్రో వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది. మొత్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com