Simbu : తమిళ సినీ రంగంలో అత్యంత ప్రేమాదరణ పొందిన నటి త్రిష కృష్ణన్. రోజు రోజుకు వయసు పెరుగుతున్నా ఇంకా పడుచు అమ్మాయి లాగానే ఉంటోంది. అద్భుతమైన అందంతో పాటు నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తను వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే అజిత్ కుమార్ తో కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ అయ్యింది. అంతకు ముందు తనతోనే స్క్రీన్ షేర్ చేసుకున్న విదాముయార్చికి మిశ్రమ స్పందన లభించింది. మెగాస్టార్ చిరంజీవితో నటించనుంది. వరుస సినిమాలలో బిజీగా ఉంది త్రిష కృష్ణన్.
Simbu-Trisha Movie Updates
తాజాగా మరో కీ రోల్ పోషిస్తోంది దర్శక ధీరుడు మణిరత్నం తీస్తున్న థగ్ లైఫ్ లో. ఈ సినిమాకు కథను కూర్చింది కమల్ హాసన్. ఇందులో పాట కూడా రాశాడు. ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కమల్ తో పాటు త్రిష కృష్ణన్, శింబు(Simbu) కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. సినిమాల పరంగా వీరు కలిసి నటించి 15 ఏళ్లవుతోంది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి థగ్ లైఫ్ తో కలిసి నటిస్తుండడం విశేషం. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది త్రిష కృష్ణన్.
అంతకు ముందు త్రిష, శింబు కలిసి విన్నై తండి వరువాయాలో పని చేశారు. ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మణిరత్నం తీసిన పన్నీర్ సెల్వన్ మూవీలో నటించింది త్రిష. తనతో పాటు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కీ రోల్ పోషించింది. ఇందులో కార్తీ నటించాడు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత తెర పంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది త్రిష కృష్ణన్. తామిద్దరం నటుల కంటే వ్యక్తిగతంగా మంచి స్నేహితులమని చెప్పింది. తను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Hero Prabhas :ఇటలీలో సేద దీరుతున్న డార్లింగ్ ప్రభాస్