తమిళ సినీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం థగ్ లైఫ్. గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో వస్తున్న మూవీ. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు చిత్ర బృందం. ప్రధానంగా ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, మ్యూజిక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతిది పద్దతిగా చేస్తూ వస్తున్నాడు మణిరత్నం. తాజాగా హైదరాబాద్ లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్బంగా తమ అనుభవాలను పంచుకున్నారు సినిమా షూటింగ్ సందర్భంగా .
ఇందులో దాదాపు చాలా కాలం పాటు దూరంగా ఉన్న త్రిష కృష్ణన్, సిలాంబరసన్ కలిసి నటించారు. అంతేకాకుండా 38 ఏళ్లు సుదీర్ఘ విరామం అనంతరం మణిరత్నం, కమల్ హాసన్ తిరిగి కలవడం విశేషం. ముంబై ఆధిపత్య పోరును అద్భుతంగా తెరకెక్కించాడు . అదే నాయకుడు. దీనికి ఇళయరాజా సంగీతం అందించాడు. తను ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆనాడు ఎస్పీబీ పాటలు పాడితే..ఈసారి తను లేడు.
ఎందుకనో మణిరత్నం ఇళయరాజాను వాడుకోలేదు. తను కొత్తగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నాడు. గతంలో తను తీసిన పొన్నియన్ సెల్వన్ మూవీకి కూడా తనే మ్యూజిక్ ఇచ్చాడు. థగ్ లైఫ్ కు ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ ఇచ్చింది. తాజాగా థగ్ లైఫ్ గురించి త్రిష కృష్ణన్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. తన జీవితంలో మరిచి పోలేని సినిమా ఏదైనా ఉందంటే అది మణిరత్నం సర్ మూవీనంటూ పేర్కొంది.