మైథలాజికల్ మూవీస్ కు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో దర్శక, నిర్మాతలంతా వీటిని ఆధారంగా చేసుకుని కథలు తయారు చేయడంలో బిజీగా మారారు. ఇక ఇదే కోవలో ఎప్పటి నుంచో తాను ఇతిహాసపు నేపథ్యంతో మూవీ తీయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన కలానికి బలుపు , పొగరు ఎక్కువ. కేవలం తను రాసే డైలాగుల కోసమే సినిమా కోసం వచ్చే వారు చాలా మంది ఉన్నారు.
తన చిత్రం ద్వారా మంచి మెసేజ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది మహేష్ బాబు, శ్రీలీలతో కలిసి తీసిన గుంటూరు కారం ఆశించిన మేర ఆడలేదు. తను గతంలో ఇదే స్టార్ హీరోతో అతడు తీశాడు. అది బ్లాక్ బస్టర్. ఆ తర్వాత అనుష్క శెట్టితో ఖలేజా తీశాడు. ఇది సూపర్ సక్సెస్. తాజాగా మూవీ మేకర్స్ ఖలేజాను రీ రిలీజ్ చేశారు. మంచి ఆదరణ లభించింది. భారీ ఎత్తున కలెక్షన్స్ రావడం విస్తు పోయేలా చేసింది.
ఇది పక్కన పెడితే తను మొదటగా మైథలాజికల్ మూవీని పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నాడు. ఇదే మాటను బయట పెట్టాడు. కానీ మనోడు ఊహించని షాక్ ఇచ్చాడు. తను తమిళ సినీ డైరెక్టర్ అట్లీ కుమార్ తో కమిట్ అయి పోయాడు. దీంతో ఇంకో దారి చూసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తనతో దగ్గరి అనుబంధం కలిగి ఉన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించాడు.
విక్టరీ వెంకటేశ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో తదుపరి సినిమాలు తప్పకుండా ఉంటాయని ప్రకటించాడు. ఆయన చేసిన తాజా కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి.