తార‌క్ తో త్రివిక్ర‌మ్ పౌరాణిక చిత్రం

ప్ర‌శాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ బిజీ

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. మొద‌ట అల్లు అర్జున్ తో మూవీ తీస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఊహించని విధంగా పుష్ప 2 తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ఇండియ‌న్ ఐకాన్ స్టార్ ఉన్న‌ట్టుండి త‌న మ‌న‌సు మార్చుకున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తో జ‌త క‌ట్టాడు. ఇప్ప‌టికే సినిమా టైటిల్ ఖ‌రారు కూడా చేసేశాడు. దీంతో త‌ను అనుకున్న ప్రాజెక్టు కొంచెం ఆల‌స్యం కావ‌డంతో మ‌రో హీరోపై ఫోక‌స్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. మాట‌ల మాంత్రికుడిగా త‌న‌కు పేరుంది.

గ‌తంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ తో అర‌వింద స‌మేత తీశాడు. ఇది సూప‌ర్ హిట్ గా నిలిచింది. దీనిని రాయ‌ల‌సీమ నేప‌థ్యంతో తీశాడు. మాట‌ల తూటాలు పేలాయి. హింస కూడా కొంచెం ఎక్కువే. కానీ తార‌క్ ఇందులో న‌ట‌నా ప‌రంగా అద్భుతంగా చేశాడు.బ‌న్నీతో త‌ను గ‌తంలో జులాయి తీశాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఇది అద్భుతంగా ఆడింది. మాట‌ల కోస‌మే సినిమాను చూసేందుకు వెళ్లిన వాళ్లున్నారు. ఆ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన అల వైకుంఠ‌పురంలో తీశాడు. మ్యూజిక‌ల్ గా హిట్ గా నిలిచింది.

ఈ సినిమా అనంత‌రం ప్రిన్స్ మ‌హేష్ బాబుతో గుంటూరు కారం తీశాడు. ఇందులో శ్రీ‌లీల కీ రోల్ పోషించింది. కానీ ఆశించిన మేర ఆడ‌లేదు. అయినా త‌న‌తో న‌టించేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఉత్సుక‌త చూపిస్తారు. తాజాగా త‌న నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. డ్రాగ‌న్ సినిమా షూటింగ్గ లో బిజీగా ఉన్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్. ఇదే స‌మ‌యంలో తార‌క్ కు క‌థ వినిపించాడ‌ని, పూర్తిగా పౌరాణిక చిత్రంగా ఉండ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com