రామ్ చ‌ర‌ణ్ తో త్రివిక్ర‌మ్ చిత్రం

చ‌క్రం తిప్పిన స్టార్ హీరోనంటూ టాక్

సినీ రంగంలో ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారో ఇంకెప్పుడు సినిమాతో జ‌త క‌డ‌తారో ఎవ‌రూ చెప్ప‌లేరు. దీనికి కార‌ణం మ‌నం తెర మీద చూపించినంత‌గా సంబంధాలు ఉండ‌వు. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా ఉంటాయి రిలేష‌న్స్. ఇది ప‌క్క‌న పెడితే టాలావుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ల‌లో సుకుమార్ , త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఉన్నారు. వీరిద్ద‌రూ కూడా రామ్ చ‌ర‌ణ్ తో సినిమా తీయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్ప‌టికే మాట‌ల మాంత్రికుడు విక్ట‌రీ వెంక‌టేశ్ తో జ‌త క‌ట్టాడు.

దీనికి సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు కూడా. ఆ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా వెంకీ తెలిపాడు.
అంత‌కు ముందు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ చాలా సార్లు ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు క‌థలు వినిపించాడు. ఇద్ద‌రూ కూడా ఓకే అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ ఉన్న‌ట్టుండి త‌న‌తో సినిమా ఉండ‌డం లేదంటూ తెలిపాడు అల్లు అర్జున్. త‌ను ప్ర‌స్తుతం స్టార్ సినీ నిర్మాణ సంస్థ టాప్ డైరెక్ట‌ర్ అట్లీతో క‌లిసి బ‌న్నీతో సినిమా తీస్తోంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా.

ఈ ఇద్ద‌రికీ క‌లిపి దేశ సినీ రంగంలో ఎవ‌రికీ ఇవ్వ‌ని రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు జోరుగా ప్రచారం జ‌రిగింది. ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్, హీరో అల్లు అర్జున్ కు క‌లిపి రూ. 350 కోట్ల‌కు పైగా పారితోష‌కంగా ఇస్తున్న‌ట్లు వినికిడి. దీనిని ఈ ఇద్ద‌రు ఖండించ‌లేదు. ఇదే స‌మ‌యంలో సుకుమార్ తాను తీసిన పుష్ప 2 బిగ్ రికార్డ్ న‌మోదు చేసింది. ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది. ఇది సినీ ఇండ‌స్ట్రీలోనే అత్య‌ధిక వ‌సూలు చేసిన సినిమాగా నిలిచింది.

ఇదే క్ర‌మంలో సుకుమార్ త‌న స్వంతూరుకు వెళ్లాడు. చెర్రీతో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి రంగ‌స్థ‌లం చేశారు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో స‌మంత, అన‌సూయ న‌టించారు. కానీ ఉన్న‌ట్టుండి సుకుమార్ కాద‌ని త్రివిక్ర‌మ్ తో చెర్రీ మూవీ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని వెనుక ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోక్యం చేసుకున్న‌ట్లు టాక్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com