India-Pakistan Ceasefire Sensational :భార‌త్..పాకిస్తాన్ దేశాల కాల్పుల విర‌మ‌ణ

ప్ర‌క‌టించిన అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్

India-Pakistan Ceasefire Sensational

India : భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల న‌డుమ పాకిస్తాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా చేసిన సూచ‌న‌ల మేర‌కు త‌మ దేశం కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించిన‌ట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ కాల్పుల విర‌మ‌ణ శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుండి వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదిక‌గా ఇరు దేశాలు కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించాయ‌ని తెలిపారు. ఇరు దేశాల‌కు కంగ్రాట్స్ తెలిపారు.

India-Pakistan Ceasefire Viral

పాకిస్తాన్, భారతదేశం తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయ‌న్నారు ఇషాక్ దార్. పాకిస్తాన్ ఎల్లప్పుడూ దాని సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడకుండా ఈ ప్రాంతంలో శాంతి , భద్రత కోసం కృషి చేసిందన్నారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో కాల్పుల విరమణను ప్రక‌టించిన విష‌యాన్ని వెల్ల‌డించారు యుఎస్ దేశాధ్య‌క్షుడు. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ రాత్రి చర్చల తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ పూర్తి, తక్షణ ఒప్పందానికి అంగీకరించాయని ప్రకటించడానికి తాను సంతోషంగా ఉన్నాన‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా భార‌త విదేశాంగ శాఖ మంత్రి మిస్రీ కూడా కాల్పుల విర‌మ‌ణ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

Also Read : Janhvi Kapoor Shocking :యుద్దం వ‌ద్దు శాంతి ముద్దు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com