అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొలువు తీరాక తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హెచ్ -1బి వీసా నియమాలను కఠినతరం చేశారు. దీంతో ప్రత్యామ్నాయ వీసాలు , గ్రీన్ కార్డ్ మార్గాలు ప్రజాదరణ పొందాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, ఈ సంవత్సరం ఎంపిక చేయబడిన H-1B దరఖాస్తుల సంఖ్యలో 27 శాతం తగ్గుదల ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా కోవిడ్ ప్రభావిత సంవత్సరం 2021 తర్వాత ఇది అత్యల్పం అని చెప్పక తప్పదు.
ఇక హెచ్ 1బి వీసాల గురించి చూస్తే ప్రతి సంవత్సరం అమెరికా 85 వేల వీసాలను జారీ చేస్తుంది. వీటిలో అత్యధికంగా ప్రవాస భారతీయులు 70 శాతానికి పైగా పొందుతారు. మనోళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆ దేశ ఓట్లలో కూడా ప్రభావం చూపిస్తారు. తాజాగా యుఎస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కారణంగా మైక్రో సాఫ్ట్, గూగుల్, ఇంటెల్, పొలారిస్, జెన్ పాక్ట్ , తదితర దిగ్గజ కంపెనీలలో పని చేస్తున్న టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
వీసాలలో ఎల్ -1 వీసా జారీ చేస్తారు. భారతదేశం నుండి అమెరికాలో ఒకే కంపెనీలో బదిలీ అయ్యే ఉద్యోగుల కోసం ఇస్తారు. ఓ1 వీసా ను సైన్స్, ఆర్ట్స్ లేదా వ్యాపారంలో అసాధారణ నైపుణ్యాలు ఉన్న వ్యక్తుల కోసం జారీ చేస్తుంది అమెరికా ప్రభుత్వం. గత కొన్ని నెలలుగా ఈ వీసాలపై ఆసక్తి పెరిగిందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు పేర్కొంటున్నారు. కొన్ని కంపెనీలు భారతీయ ఉద్యోగులను కెనడా వంటి ఇతర దేశాలకు స్వల్ప కాలానికి పంపుతున్నాయి,