మిస్డ్ కాల్స్ తో వేగ‌లేక పోతున్నా – వైభ‌వ్

బీహార్ కుర్రాడు ఐపీఎల్ లో దుమ్ము రేపాడు

చెన్నై – ఐపీఎల్ 2025 మెగా టోర్నీ ఇంకా ముగియ‌లేదు. కానీ అనుకోకుండా 18వ సీజ‌న్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ తో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిష్క్ర‌మించింది. ఆ జ‌ట్టు 9వ స్థానంలో ఉండ‌గా సీఎస్కే 10వ స్థానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్స్ కు చేరుకోలేక పోయాయి. ఇప్ప‌టికే గుజ‌రాత్ టైటాన్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు టాప్ లో కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ భారీ స్కోర్ ను ఛేధించింది.

బీహార్ కుర్రాడు వైభ‌వ్ సూర్య‌వంశీ సూపర్ గా ఆడాడు. త‌ను 33 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 4 ఫోర్లు 4 సిక్స్ ల‌తో 57 ర‌న్స్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్ లో త‌న కెరీర్ లో గుజ‌రాత్ టైటాన్స్ కు వ్య‌తిరేకంగా సెంచ‌రీ న‌మోదు చేశాడు. చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఆట‌గాడిగా త‌ను ఎంట్రీ ఇచ్చాడు. త‌న‌ను ఏరికోరి తీసుకున్నాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. త‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ఆడాడు. జ‌ట్టు ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచేలా చేశాడు.

ఇదిలా ఉండ‌గా చెన్నై మ్యాచ్ త‌ర్వాత పెద్ద ఎత్తున త‌న మొబైల్ కు మిస్డ్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని, ఏకంగా 500కు పైగా ఉన్నాయ‌ని తెలిపాడు. త‌న‌కు ఒంట‌రిగా ఉండ‌టం అంటే ఇష్ట‌మ‌ని, వీలు కుదిరితే కుటుంబంతో గ‌డుపుతాన‌ని చెప్పాడు. ఈ సంద‌ర్బంగా ద్ర‌విడ్ కీల‌క సూచ‌న‌లు చేశాడు వైభ‌వ్ కు. వ‌చ్చే సీజ‌న్ కు ప్రిపేర్ అయి రావాల‌ని సూచించాడు. బౌల‌ర్లు నిన్ను ఔట్ చేసేందుకు ప్రిపేర్ అయి వ‌స్తాడ‌ని అన్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com