టాలీవుడ్ లో ఇప్పుడు బెస్ట్ కమెడియన్ ఎవరంటే ఠకీమని చెప్పే ఏకైక నటుడు వెన్నెల కిషోర్. తను బ్రహ్మానందం లాంటి దిగ్గజ నటుడు సైతం మెచ్చుకున్నాడు. తన వారసుడు అతడేనంటూ సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని తనతో తీసిన బ్రహ్మానందం మూవీ ఈవెంట్ సందర్బంగా వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వెన్నెల కిషోర్ లో ఉన్న ప్రతిభ ఏమిటో చెప్పకనే చెప్పేలా చేశాయి.
తను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు. ఆ సమయంలోనే సినిమాల మీద ఉన్న పేషన్ తో ఇందులోకి అనుకోకుండా వచ్చాడు. పూర్తి స్థాయిలో హాస్య నటుడిగా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు వెన్నెల కిషోర్. తను అసలు పేరు బొక్కల కిషోర్ కుమార్. తన వయసు 44 ఏళ్లు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి. తను నటుడే కాదు మంచి దర్శకుడు కూడా. 2005లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాడు. వెన్నెల అనే సినిమాలో నటించాడు. అదే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
వృత్తి పరంగా మంచి ప్రతిభ కనబర్చినందుకు గాను వెన్నెల కిషోర్ కు 2 నంది పురస్కారాలు లభించాయి. వెన్నెల చిత్రానికి దేవ కట్టా దర్శకత్వం వహించాడు. డీజే చిత్రంలో ఆకేళ్ల విఘ్నేశ్వర్ రావు పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వరుసగా హిట్ అయిన ప్రతి మూవీలో తను కీలక పాత్ర పోషించడం విశేషం. బిందాస్, పిల్ల జమీందార్, దరువు, సర్కార్ వారి పాట, బాద్ షా , దూసుకెల్తా, అతడు, పండుగ చేస్కో, గూఢచారి, సన్నాఫ్ సత్యమూర్తి, భలే భలే మగాడివోయ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, దూకుడు..ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. తను తాజాగా నటించిన సింగిల్ కూడా బిగ్ హిట్.