విజ‌య్ సేతుప‌తి ఏస్ మూవీ క‌లెక్ష‌న్స్

రూ. 10 కోట్ల‌కు చేరుకున్న చిత్రం

త‌మిళ సినీ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించిన చిత్రం ఏస్. ఇది భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 17 రోజుల క‌లెక్ష‌న్స్ ప‌రంగా చూస్తే రూ. 10 కోట్లు దాటింది. ఆశించిన మేర ఆడ‌క పోయినా మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. గ‌తంలో త‌ను న‌టించిన రెండు మూవీస్ బిగ్ స‌క్సెస్ అయ్యాయి. వాటి స్థానంలో ఏస్ నిలుస్తుంద‌ని ఆశించారు. కానీ అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏస్ రిలీజ్ సంద‌ర్భంగా విజ‌య్ సేతుప‌తి చిట్ చాట్ చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

త‌ను ఫెయిల్యూర్, స‌క్సెస్ గురించి ఏమాత్రం ప‌ట్టించుకోనంటూ పేర్కొన్నాడు. వాటిని స‌మానంగా చూస్తాన‌ని చెప్పాడు. ద‌ర్శ‌కుడు ఎవ‌రు, త‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, నిర్మాత‌లు సేఫ్ గా ఉన్నారా లాంటి విష‌యాల జోలికి వెళ్ల‌న‌ని చెప్పాడు. త‌న‌కు క‌థ న‌చ్చితే చాలు అవ‌త‌ల ద‌ర్శ‌కుడు గ‌తంలో తీసిన సినిమాలు అంత‌గా ఆడ‌క పోయినా తాను ఒప్పుకుంటాన‌ని, త‌న‌కు భేష‌జాలు అంటూ ఉండ‌వ‌న్నాడు.

మిగ‌తా వారితో తాను పోల్చుకోవ‌డం ఇష్టం ఉండ‌ద‌న్నాడు. ఒక్కోసారి హిట్ అవుతుంది. ఇంకోసారి ఆశించినంత‌గా ఆడ‌క పోవ‌చ్చు. కానీ సినిమా అన్న‌ది ఒక ర‌కంగా సామాజిక బాధ్య‌త‌ను నెర‌వేర్చాల్సి ఉంటుంద‌న్నాడు విజ‌య్ సేతుప‌తి. త‌ను ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ తో భ‌వ‌తి భిక్షాందేహిలో క‌మిట్ అయ్యాడు. దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. విజ‌య్ సేతుప‌తితో జ‌త క‌ట్టింది రుక్మిణి వ‌సంత్. త‌ను అద్భుతంగా న‌టించింది. ఈ ఇద్ద‌రి పెయిర్ స‌రిగ్గా స‌రి పోయింది . ఎందుక‌నో సినిమాను ఆక‌ట్టుకోలేక పోయింది. కానీ రూ. 10 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించడం విశేషం.

ఏస్ చిత్రాన్ని అరుముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త నెల మే 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విమ‌ర్శ‌కుల నుండి మిశ్ర‌మ స‌మీక్ష‌ల‌ను అందుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com