మే 23న తెలుగు, త‌మిళంలో సేతుప‌తి ‘ఏస్’ రిలీజ్

శ్రీ ప‌ద్మిని సినిమాస్ బ్యాన‌ర్ పై రానున్న చిత్రం

స‌క్సెస్ , ఫెయిల్యూర్ ను ప‌ట్టించుకోని ఏకైక న‌టుడు త‌మిళంలో ఎవ‌రైనా ఉన్నారంటే త‌ను ఒకే ఒక్క‌డు విజ‌య్ సేతుప‌తి. ఆ మ‌ధ్య‌న త‌న కూతురు లాంటి అమ్మాయితో హీరోగా చేయ‌నంటూ ప్ర‌క‌టించాడు. అంతే కాదు ఎవ‌రైనా ఏ హీరో అయినా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క బెట్టుకోవాల‌ని అనుకుంటాడు. కానీ మ‌నోడు అలా కాదు. చాలా క‌ష్ట‌ప‌డి, ఎవ‌రి సిఫార‌సు లేకుండా పైకి వ‌చ్చాడు. ఇటు కోలీవుడ్ లో అటు టాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు.

త‌ను హిందీలో కూడా గ‌త ఏడాది ఎంట్రీ ఇచ్చాడు. అట్లీ కుమార్ తీసిన జ‌వాన్. ఇందులో షారుక్ ఖాన్ సైతం త‌న న‌ట‌నను చూసి స‌ర్ అని పిలిచాడు. అయినా ఎక్క‌డా కించిత్ గ‌ర్వం అనేది లేకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప‌లు సినిమాలు తీసి బోర్లా ప‌డిన ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కు ఛాన్స్ ఇచ్చాడు. త‌న‌తో క‌లిసి పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పాడు. ఇది త‌న స్పెషాలిటీ.

ఇక తాజాగా తాను న‌టించిన కొత్త చిత్రం ఏస్. ఇది త‌మిళం, తెలుగులో వ‌స్తోంది. ఈ చిత్రంలో త‌న‌తో పాటు రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా చేసింది. కీ రోల్ పోషించాడు యోగి బాబు. మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు అరుముగ కుమార్ . పూర్తిగా భావోద్వేగాల‌ను తెర మీద చూపించే ప్ర‌య‌త్నం చేశాడు . ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న ల‌భించింది. మే 23న ప్రేక్ష‌కుల ముందుకు రెండు భాష‌ల‌లో రానుంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com