ఈ గెలుపు మాది కాదు అభిమానుల‌ది

ఆర్సీబీ స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ కామెంట్

18 ఏళ్ల సుదీర్గ విరామం త‌ర్వాత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఐపీఎల్ 2025 ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. ప్ర‌త్య‌ర్థి పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టును 6 ప‌రుగుల తేడాతో ఓడించి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ కీల‌క‌మైన పాత్ర పోషించాడు. యంగ్ క్రికెట‌ర్ ర‌జ‌త్ పాటిదార్ ను ఆర్సీబీ యాజ‌మాన్యం నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ బ‌ల‌మైన జ‌ట్ల‌ను ఓడించింది. ద‌ర్జాగా క‌ప్ ఎగ‌రేసుకు పోయింది. ఈ సంద‌ర్బంగా గ‌త కొన్నేళ్లుగా స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి దాకా ఆర్సీబీతోనే కొన‌సాగుతూ వ‌చ్చాడు విరాట్ కోహ్లీ. ఈ సంద‌ర్బంగా గెలిచిన అనంత‌రం క‌ప్ ను ముద్దాడాడు. అనంత‌రం మీడియాతో మాట్లాడాడు. అంత‌కు ముందు క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. మైదానంలో బావురు మ‌న్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు విరాట్ కోహ్లీ. ఇన్నేళ్లుగా నా ఆత్మ‌, హృద‌యం అంతా బెంగ‌ళూరు జ‌ట్టుతోనే ఉంద‌న్నాడు. అంతే కాదు ఈ జ‌ట్టు విజ‌యంలో గ‌తంలో కీల‌క పాత్ర పోషించిన డివిలియ‌ర్స్, క్రిస్ గేల్ ను మ‌రిచి పోలేమ‌ని చెప్పాడు . వాళ్ల స‌హ‌కారం లేక పోతే ఇంత దాకా వ‌చ్చి ఉండేవాళ్లం కాద‌న్నాడు. మొత్తంగా ఈ అద్భుత విజ‌యం త‌మ‌ది కాద‌ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానులేద‌న‌ని స్ప‌ష్టం చేశాడు ర‌న్ మెషీన్.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com