18 ఏళ్ల సుదీర్గ విరామం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా అవతరించింది. ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ కీలకమైన పాత్ర పోషించాడు. యంగ్ క్రికెటర్ రజత్ పాటిదార్ ను ఆర్సీబీ యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బలమైన జట్లను ఓడించింది. దర్జాగా కప్ ఎగరేసుకు పోయింది. ఈ సందర్బంగా గత కొన్నేళ్లుగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి దాకా ఆర్సీబీతోనే కొనసాగుతూ వచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్బంగా గెలిచిన అనంతరం కప్ ను ముద్దాడాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. అంతకు ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మైదానంలో బావురు మన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ. ఇన్నేళ్లుగా నా ఆత్మ, హృదయం అంతా బెంగళూరు జట్టుతోనే ఉందన్నాడు. అంతే కాదు ఈ జట్టు విజయంలో గతంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్, క్రిస్ గేల్ ను మరిచి పోలేమని చెప్పాడు . వాళ్ల సహకారం లేక పోతే ఇంత దాకా వచ్చి ఉండేవాళ్లం కాదన్నాడు. మొత్తంగా ఈ అద్భుత విజయం తమది కాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులేదనని స్పష్టం చేశాడు రన్ మెషీన్.