కర్నూలు జిల్లా – సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వకర్మీయుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా తయారైందని వాపోయారు విశ్వ కర్మల ఆత్మ గౌరవ యాత్ర నిర్వాహకులు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణ సాంస్కృతిక పునరుజ్జీవన యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. విశ్వబ్రాహ్మణుల ప్రధాన అంశంగా ప్రారంభమైన ఈ విశ్వకర్మ యువ యాత్ర ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల చరిత్ర కలిగిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం సాంస్కృతిక పునరుజ్జీవనం , పూర్వ వైభవాన్ని సాధించడానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందన్నారు.
ఇందులో భాగంగానే విశ్వకర్మ సాంస్కృతిక యాత్రను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని స్పష్టం చేశారు.ఈ సందర్బంగా విశ్వబ్రాహ్మణ సాంస్కృతిక, విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ పర్యటన పోస్టర్లు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ త్వరలో ముందుకు రాబోతోందని ప్రకటించారు. ఇప్పటికే సాంస్కృతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నలిగిపోయిన విశ్వకర్మలు ఇకపై వ్యవస్థీకృతం కాకపోతే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మన అస్తిత్వం కోసం, చైతన్యవంతం చేసేందు కోసం ఈ యువ యాత్ర ప్రారంభించామన్నారు. పేదరికం , ఆత్మహత్య కారణంగా ఆకలితో మరణించిన విశ్వకర్మ కుటుంబాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ జాతీయ యువజన విభాగం అధ్యక్షులు కూరెళ్ల శివరాం మాట్లాడారు. ఈ విశ్వకర్మ యువజన యాత్రకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా మునిగంటి త్రినాథ్ చారిని, రాజకీయ విభాగం కన్వీనర్గా ఆమంచ శివను ఎన్నుకున్నారు. శ్రీశైల విశ్వబ్రాహ్మణ సత్రం ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంచర్ల కృష్ణమూర్తి చారి, సొల్లేటి ప్రభాకరాచారి, కౌలే జగన్నాదం, పోలోజు కార్తీక్ చారి, ఇడుకోజు నరేష్ చారి, సదానంద ఆచారి, తేజ ఆచారి, కనపర్తి లక్ష్మణాచారి, నవీన్ కుమార్ చారి, హరికాంత్ చారి, లోకేష్ చారి, కమల్ చారి, గుగ్గిళ్ల సతీష్ చారి పాల్గొన్నారు.