Kingdom : సితార ఎంటర్టైన్మెంట్, పార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కింగ్ డమ్. దీనిని తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్ తిన్నసూరి. ఇందులో అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే కీ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కీలకమైన సన్నివేశాలను శ్రీలంక, తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇటీవలే సినిమా టీజర్ కు భారీ స్పందన వచ్చింది. రిలీజ్ చేసిన సాంగ్ కు మంచి ఆదరణ లభించింది. ఇక మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.
Kingdom Movie Updates
కానీ ఇప్పుడు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ తరుణంలో కింగ్ డమ్(Kingdom) ను రిలీజ్ చేయాలా లేక వాయిదా వేసుకోవాలా అనే దానిపై నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. గౌతమ్ తిన్నసూరి టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో విజయ్ దేవరకొండను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు.
ఇక సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది ఈ చిత్రంపై . వార్ కారణంగా వాయిదా వేశారని, ఇప్పట్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాదని నెటిజన్లు కొందరు పేర్కొంటుండడం గమనార్హం. అయితే దర్శకుడు కింగ్ డమ్ ను పాన్ ఇండియా లెవల్లో తీశాడు. ప్రస్తుతం వార్ కుదట పడ్డాక సినిమాను రిలీజ్ చేస్తేనే బెటర్ అన్న ఆప్షన్ ను ఎంచుకున్నారని, దీంతో జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అప్పట్లో వర్షాలు కురుస్తాయి. అయినా జనం థియేటర్లలోకి వెళ్లడం ఖాయమని , టాక్ వస్తే చాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : Hero Chiranjeevi Movie :మెగాస్టార్ శ్రీదేవి మూవీ కలెక్షన్స్ అదుర్స్