అందంతో పాటు అభినయంలో కూడా ఫుల్ మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా. తను ఇటు సినిమాలు, ఈవెంట్స్, వెబ్ సీరీస్ తో బిజీగా మారి పోయింది. ఈ ఏడాదిలో తను నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ సాధించాయి. తనకు మంచి ఆదరణ కూడా లభించింది. వాటిలో ఒకటి స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తొలిసారిగా మైత్రీ మూవీ మేకర్స్ హిందీలో సన్నీ డియోల్ తో తీసిన జాట్ లో తళుక్కున మెరిసింది రెజీనా. ఇంకో మూవీ అక్షమ్ కుమార్ నటించిన కేసరి 2 లో కూడా భాగంగా మారింది.
ఈ రెండు సినిమాలలోని పాత్రల ద్వారా రెజీనా తనలో టాలెంట్ ఉందని నిరూపించుకుంది. గతంలో టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించింది. తెలుగు వారి ప్రేక్షకుల మనసు దోచుకుంది కూడా. కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, రోటిన్ లవ్ స్టోరీ, సుబ్రమణ్యం ఫర్ సేల్ లో కీ రోల్ పోషించింది. ఈ సినిమాలు మంచిగా ఆడాయి. తన స్వంత భాష మాత్రం తమిళం అయినా అక్కడ కూడా తన మార్క్ తో దూసుకు పోతోంది. వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పడం లేదు. కేవలం తనకు నచ్చితేనే , ఆ పాత్ర ద్వారా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంటానని అనుకుంటేనే సంతకం చేస్తోంది.
లేకపోతే ముఖం మీదే తాను చేయలేనంటూ చెప్పేస్తోంది రెజీనా కసాండ్రా. చిట్ చాట్ సందర్బంగా తను కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ కెరీర్ ఇప్పుడు బానే ఉంది. వెబ్ సీరీస్ కూడా సమయం కుదిరినప్పుడు చేస్తున్నా. జీవితంలో సినిమాల పరంగా చూస్తే లేదా సీరీస్ లలోనైనా సరే ఏ పాత్ర అయినా మనసుకు హత్తు కోవాలి. అది జీవితాంతం గుర్తిండి పోవాలి. అలాంటి వాటికే తను ప్రయారిటీ ఇస్తానని స్పష్టం చేసింది. కాసుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని పేర్కొంది రెజీనా కసాండ్రా.