ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం మేరకు మే 26 లోపు ఆయా జట్లు విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక సూచన చేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా. దీంతో ఇంకా ప్లే ఆఫ్స్ తో పాటు సెమీ ఫైనల్స్ , ఫైనల్ మ్యాజ్ జరగాల్సి ఉంది. భారత్ , పాకిస్తాన్ యుద్దం కారణంగా ఈనెల 25న పూర్తి కావాల్సిన ఐపీఎల్ ను జూన్ 3కు వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, తదితర దేశాలకు చెందిన ఆటగాళ్లు కీలక భూమిక పోషిస్తున్నారు ఐపీఎల్ మెగా టోర్నీలో. ఒప్పందం గడువు లోగా విదేశీ ప్లేయర్లు తమ తమ దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదే సమయంలో దుబాయ్ వేదికగా జరిగిన వేలం పాటలో అత్యధిక ధరకు వీళ్లను కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు.
ముందే వెళుతుండడంతో జట్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. వీరిలో టాప్ ఆల్ రౌండర్ గా పేరు పొందిన విల్ జాక్స్ తో పాటు వికెట్ కీపర్ , స్టార్ ఫినిషర్ అయిన రికెల్టన్ కూడా వెళ్లనున్నారు ఐపీఎల్ ను విడిచి. దీంతో ఈసారి ఎలాగైనా సరే ఐపీఎల్ 2025 కప్ ను చేజిక్కించు కోవాలని టార్గెట్ పెట్టుకుంది. పాండ్యా సారథ్యంలో ఆట ప్రారంభంలో కొన్ని మ్యాచ్ లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది.