ముంబై – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది ముంబై ఇండియన్స్. ఎవరూ ఊహించని రీతిలో ప్రారంభంలో వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా సేన పుంజుకుంది. అనూహ్యంగా వరుస విజయాలతో దూసుకు పోతోంది. ఈ జట్టు గెలుపొందడంలో కీలక భూమిక పోషించారు సూర్య కుమార్ యాదవ్ , విల్ జాక్స్. ఈ సందర్భంగా చిట్ చాట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. తను ముంబైతో జత కట్టడం ఆనందంగా ఉందన్నాడు. తాను తన ఆట పట్ల పూర్తిగా సంతృప్తితో ఉన్నానని పేర్కొన్నాడు.
ఫుల్ ఫామ్ తో ఉన్నానని, ఏ ప్లేస్ లో ఆడేందుకైనా సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఐపీఎల్ టోర్నీలో పరుగుల వరద పారించాడు. పంజాబ్ కింగ్స్ తో తాడే పోడే తేల్చుకునేందుకు తమ టీమ్ పూర్తిగా సన్నద్దమై ఉందన్నాడు. జట్టు బ్యాటింగ్ లైనప్కు కొన్నిసార్లు నిర్దిష్ట పరిస్థితులకు వేర్వేరు ఆటగాళ్లు అవసరమని అర్థం చేసుకుని, మూడవ స్థానం లేదా దిగువన ఉన్న స్థానాల్లో బ్యాటింగ్ చేయడం తనకు సౌకర్యంగా ఉందని చెప్పాడు విల్ జాక్స్.
“నా పాత్ర అనువైనది. నేను స్పష్టంగా 3వ స్థానంలో ఉన్నాను, లేదా కొన్నిసార్లు నేను తరువాత దిగి పోవాల్సి ఉంటుంది. కానీ అది నాతో పూర్తిగా బాగానే ఉంది. జట్టుకు నేను చేయాల్సిన ఏ పాత్రనైనా పోషించడానికి నేను సంతోషంగా ఉన్నాను. మీరు చెప్పినట్లుగా, మాకు చాలా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఇతర ఆటగాళ్లకు బాగా సరిపోతాయి. మీరు ఆటగాడిగా సౌకర్యవంతంగా ఉండాలన్నాడు విల్ జాక్స్. తను సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు.