అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. యోగా ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరు తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగాను పాటించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. యోగా డే సందర్బంగా కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు . యావత్ దేశం ఆశ్చర్య పోయేలా యోగా డేను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇందు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.
కీలక సూచనలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డేను నిర్వహించాలని స్పష్టం చేశారు. అంతే కాకుడా మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్రమంతటా యోగా మంత్ ను పాటించాలని పిలుపునిచ్చారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని చెప్పారు.
ఈ నిర్వహణ గురించి జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని సూచించారు సీఎం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అంతేకాకుండా నెల రోజుల పాటు యోగా ను ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విశాఖలో లక్షలాది మందితో పాటు ప్రధాని యోగాసనాలు వేస్తారన్నారు. ఆర్కే బీచ్ మొత్తం యోగాసానాలతో నిండి పోవాలన్నారు.