జ‌గ‌న‌న్నా ర‌ఫ్ఫా రఫ్పా న‌రుకుతామంటే ఎలా..?

సోద‌రుడిపై నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి -ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న సోద‌రుడు, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. రఫ్ఫా రఫ్ఫా నరుకుతాం వ్యాఖ్యలను స‌మ‌ర్థించ‌డం దారుణ‌మ‌న్నారు. మోడీకి జ‌గ‌న్ నిజంగా ద‌త్త పుత్రుడంటూ ఆరోపించారు. ఏం ముఖం పెట్టుకుని మోదీ విశాఖ‌కు వ‌స్తున్నాడంటూ ప్ర‌శ్నించారు. ఈ సారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా ? లేదా అని నిల‌దీశారు. శుక్ర‌వారం ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండి పోతున్నాయని అన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో త‌న‌కైనా సోయి ఉందా అంటూ ఎద్దేవా చేశారు జ‌గ‌న్ ను ఉద్దేశించి ష‌ర్మిలా రెడ్డి. మోడీ మద్దతు తోనే జగన్ బహిరంగంగా ఇంత విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. వివేక హత్య నే కాదు అన్ని విషయాల్లో త‌న‌కు పీఎం స‌పోర్ట్ ఉంద‌న్నారు.

త‌ను హామీలు ఇచ్చి 10 ఏళ్లు దాటిందన్నారు. తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఆ త‌ర్వాత మ‌రిచి పోయారంటూ మండిప‌డ్డారు. ప్రత్యేక హోదా విభజన హక్కు అని, హోదా విషయంలో మోడీ చేసింది మోసం అన్నారు. క‌నీసం స్పందించ‌డం కూడా లేద‌న్నారు. ఇంత జ‌రుగుతున్నా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. పోలవరం మీద కూడా మోడీ మోసం చేశారన్నారు. ప్రైవేటీక‌ర‌ణ లేదంటూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com