ఐసీసీ టెస్టు విశ్వ విజేత ద‌క్షిణాఫ్రికా

దుమ్ము రేపిన మార్క్ర‌రామ్..బ‌వుమా

ఇంగ్లండ్ – ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ఛాంపియ‌న్ షిప్ -2025 విశ్వ విజేత‌గా నిలిచింది బ‌వూమా స్కిప్ప‌ర్ సార‌థ్యంలోని ద‌క్షిణాఫ్రికా. ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా జ‌ట్టుకు షాక్ ఇచ్చింది. 27 ఏళ్ల త‌ర్వాత త‌న క‌ల‌ను సాకారం చేసుకుంది. లార్డ్స్ మైదానంలో వేలాది మంది సాక్షిగా జ‌రిగిన కీల‌క ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ లో ఆసిస్ ను ఓడించింది. విజేత‌గా అవ‌త‌రించింది.

ఆసిస్ నిర్దేశించిన 282 ర‌న్స్ ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఎడెన్ మార్క్ర‌మ్ అద్భుతంగా ఆడాడు. 136 ర‌న్స్ తో దుమ్ము రేపాడు. కెప్టెన్ బ‌వుమా 66 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ 21 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. ఎన్నో ఏళ్లుగా ఛాంపియ‌న్ గా నిల‌వాల‌ని క‌ల‌లు కంటూ వ‌చ్చారు. స‌ఫారీలు ఇన్నేళ్ల పాటు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించారు. అలుపెరుగ‌ని పోరాటం చేశారు.

లార్డ్స్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో మూడో అత్య‌ధిక స్కోర్‌తో చ‌రిత్ర సృష్టించారు మ‌ర్క్‌ర‌మ్, బవుమా. భారీ భాగ‌స్వామ‌న్ని నెల‌కొల్పారు. ఈ భాగ‌స్వామ్యం భార‌త దిగ్గ‌జాలు వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, అజిత్ అగార్క‌ర్ ల పేరుతో ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఈ ఇద్ద‌రూ క‌లిసి 126 ర‌న్స్ చేశారు. ఈ సంద‌ర్బంగా టెస్టు ఛాంపియ‌న్ గా అవ‌త‌రించిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును, స్కిప్ప‌ర్ బ‌వూమాను అభినందించారు ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు, ప్ర‌ధానమంత్రితో పాటు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com